వైసీపీని వీడిన ముగ్గురు కీలక నేతలు గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్యతో పాటు సామినేని ఉదయభానుకు పవన్ కల్యాణ్ కండువా కప్పారు. ఈ సందర్భంగా నేతల ముఖ్య అనుచరులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు.