గతంలో ఎన్నడూలేని విధంగా బుడమేరు వరదలవల్ల వారం రోజుల పాటు విజయవాడ నగరం అస్తవ్యస్తం అయిపోందని వివరించారు. ఇది ఎవరూ ఊహించని ప్రకృతి విపత్తు అని, ఈ విపత్తు వల్ల ఎన్నో గృహాలు, గృహాప కరణాలు, వాహనాలు జలమయం అవ్వడమే కాకుండా కొంత మంది ప్రాణాలను కోల్పోవడం కూడా జరిగిందన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ తరపున తాము కూడా వరద ముంపుకు గురైన పలు ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో అందజేస్తున్న సహాయక చర్యలను పరిశీలించడం జరిగిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here