తిరుపతి లడ్డు కల్తీ జరిగిందనే విషయంలో  సరదాగా మాట్లాడినందుకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(pawan kalyan)కి ప్రముఖ తమిళ హీరో కార్తీ(karthi)సారీ చెప్పాడనే విషయం అందరకి తెలిసిందే.ఈ నేపథ్యంలో  చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఉన్న ఆనందమేంటో, జస్ట్ ఆస్కింగ్ అంటు ప్రకాష్ రాజ్  ట్వీట్ చెయ్యడం జరిగాయి.


ఇప్పుడు ఈ విషయం మీద ప్రకాష్ రాజ్(prakash raj)కి చురకలంటిస్తూ ప్రముఖ హీరోయిన్ మాధవిలత(madavi latha)ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ వేరే మతానికి చెందిన వాళ్ళని ఒక్క మాట అంటేనే నానా హంగామా చేస్తారు. మొన్న బెంగుళూర్ లో ఆంజనేయస్వామి పాటలని  వింటున్న వాళ్ళ దగ్గరకి వేరే మతం వాళ్ళు కొంత మంది వచ్చి పాటలు ఆపమని కొడితే ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడడు. తిరుపతి లడ్డు విషయంలో తను చేసిన పొరపాటుని కార్తీ గ్రహించి సారీ చెప్పాడు.అలా చెప్పించుకోవడంలో ఎవరకి ఆనందం రాదు. పైగా మన ధర్మం మీద మనమే కామెంట్స్ చేసుకుంటే ఇంకెవరో కామెంట్స్ చేస్తారనే ఉద్దేశంతోనే సారీ చెప్పాడు.వేరే వాళ్ళ మనోభావాల  విషయంలో ప్రకాష్ రాజ్  సైలెంట్ గా ఉంటాడు. అదే మా మనోభావాల దగ్గరకొచ్చే సరికి ప్రతిదీ పాయింట్ అవుట్ చేస్తుంటాడు. కాకపోతే ఆయన్ని సపోర్ట్ చేసే ద్రోహులు కూడా ఉంటారని చెప్పుకొచ్చింది. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here