వర్షం వరదలతో కూరగాయల తోటలు దెబ్బతిని, ట్రాన్స్ పోర్ట్ సరిగా లేక కూరగాయల ధరలు పెరుగుతుండగా తామేం తక్కువ కాదంటూ పప్పులు, నూనెలు ఇతర నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్య మధ్యతరగతి ప్రజల వంటింటి బడ్జెట్ రెండింతలవుతోంది. నెల రోజుల క్రితం పప్పులు, నూనెల ధరలు తక్కువగా ఉండగా తాజాగా అమాంతం పెరిగాయి.