నీట మునిగిన ఇళ్లు
ఖాట్మండులో 226 ఇళ్లు నీట మునిగాయని, ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ పోలీసులకు చెందిన సుమారు 3,000 మంది భద్రతా సిబ్బందితో కూడిన రెస్క్యూ టీంను మోహరించామని, ప్రజలను రక్షించడం, ప్రభావితమైన వారికి సహాయం చేయడమే ప్రస్తుతం ప్రభుత్వ ప్రాధాన్యమని నేపాల్ హోం మంత్రి రమేష్ లేఖక్ తెలిపారు. హైవేలపై రాత్రివేళల్లో బస్సులు, కార్ల రాకపోకలను నిషేధించారు. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ (nepal) లో ఏటా వర్షాకాలంలో వందలాది మంది చనిపోతున్నారు.