ఎంఈఓ ను నిర్బంధించిన విషయం తెలుసుకున్న వైరా సీఐ ఎన్.సాగర్ పాలడుగు చేరుకొని ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను శాంతింపజేసి గదికి వేసిన తాళాన్ని తీయించారు. ఎంఈఓ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న డీఈఓ సోమశేఖర్ శర్మ పాఠశాలకు చేరుకొని అసలు విషయాన్ని విద్యార్థినిల, తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఒక దశలో తల్లిదండ్రులు పాఠశాలలోని కుర్చీలు, బల్లలను విరగకొట్టారు. కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకుంటే తాము ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.