‘వికాస్ భీ, విరాసత్ భీ’

114వ మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ (narendra modi) దేశాభివృద్ధి, దేశ వారసత్వ పరిరక్షణ అంశాలను ఎంచుకున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన అమెరికా నుంచి 300 భారతీయ పురాతన కళాఖండాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడారు. ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చాలా ఆప్యాయంగా డెలావేర్లోని తన వ్యక్తిగత నివాసంలో ఈ కళాఖండాలను నాకు చూపించారు. వాటిని టెర్రకోట, రాయి, దంతాలు, కలప, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేశారు. ఆ కళాఖండాలను తిరిగి మన దేశానికి అందించారు. మన వారసత్వం పట్ల మనం చాలా గర్వపడుతున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here