అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 11 వరకు ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. సాధారణ టిక్కెట్ ఛార్జీలే వసూలు చేస్తారు. ఈ బస్సులు కడప ఆర్టీసీ జోన్ (కడప, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల) ఎనిమిది జిల్లాల పరిధిలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిర్వహిస్తాయి. తెలంగాణలోని హైదరాబాద్కు 285 బస్సులు, కర్ణాటకలోని బెంగళూరుకు 224 బస్సులు, విజయవాడకు 76 బస్సులు రాకపోకలు నిర్వహిస్తాయి.