పెండింగ్‌ పరిహారం నేడు క్లియర్ చేస్తాం..

4,315 కుటుంబాల‌కు సంబంధించి బ్యాంకు ఖాతాల స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయ‌ని.. మ‌రో 8 వేల కుటుంబాల‌కు సోమ‌వారం డీబీటీ ద్వారా ఖాతాల్లో ఆర్థిక స‌హాయం జ‌మ‌ కానుంద‌ని తెలిపారు. త్రిచ‌క్ర వాహ‌నాల న‌ష్టాల‌కు సంబంధించి 3,149 మందికి, ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు 30,722 మందికి, తోపుడు బ‌ళ్ల‌కు 431 మందికి విజ‌య‌వంతంగా వారి ఖాతాల్లో ప‌రిహారం జ‌మైన‌ట్లు కలెక్టర్ తెలిపారు. ఇళ్లు, త్రిచక్ర, ద్విచక్ర, తోపుడుబండ్లకు సంబంధించి మొత్తంమీద ఇప్పటివరకు 1,09,729 ఖాతాలకు దాదాపు రూ. 173.69 కోట్ల మేర సొమ్ము జమ చేసినట్లు వివరించారు. బ్యాంకు ఖాతాల స‌మ‌స్య‌లున్న కేసుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి, ల‌బ్ధిదారుల‌కు ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. బ్యాంకు ఖాతాల్లో స‌మ‌స్య‌లు ఉన్న‌వారు త‌మ బ్యాంకు ఖాతాల‌ను స‌రిచూసుకోవాల‌ని, స‌త్వ‌రం బ్యాంకును సంప్ర‌దించి ఆధార్‌తో బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవాల‌ని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here