కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు అక్టోబర్ 1 నుంచి నవంబరు 6 వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఆ తర్వాత నవంబరు 23న ముసాయిదా విడుదల చేస్తారు. ఆ తర్వాత నవంబర్ 9 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. నవంబరు 30న పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. 2025 మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలు , ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావు పదవీకాలం 2025 మార్చి 29తో పూర్తి అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here