అలాగే కృష్ణా-గుంటూరు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ కేఎస్ ల‌క్ష్మణ‌రావు, తూర్పు-ప‌శ్చిమ గోదావ‌రి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ వెంక‌టేశ్వరావు ప‌దవీ కాలం మ‌ర్చితో ముగియ‌నుంది. దీంతో ఈ రెండు స్థానాల్లో టీడీపీ త‌న అభ్యర్థుల‌ను పోటీలో ఉంచేందుకు సిద్ధమైంది. మొత్తం ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాల్లో క‌నీసం టీడీపీకి ఆరు, జ‌న‌సేన‌, బీజేపీకి ఒక్కొక్కటి కేటాయించే అవకాశం ఉంది. టీడీపీ త‌ర‌పున ఎవరికైతే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్లు రాలేదో వారికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. టీడీపీ నేత‌లు ఆల‌పాటి రాజేంద్రప్రసాద్‌, దేవినేని ఉమామ‌హేశ్వర‌రావు, ఎస్‌వీఎస్ఎన్ వ‌ర్మ, జ‌వ‌హ‌ర్‌, వ‌ర్ల రామ‌య్య, పీలా గోవింద, బొడ్డు వెంక‌ట‌ర‌మ‌ణ‌, గ‌న్నే వీరాంజ‌నేయులు త‌దిత‌రులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here