(1 / 5)
దూకుడైన బ్యాటింగ్ అంటే ఏంటో బంగ్లాదేశ్తో రెండో టెస్టులో భారత్ చూపించింది. టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు చేసిన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆరంభించాడు. రెండో ఓవర్లో తొలిసారి స్ట్రైక్లోకి రాగా.. తొలి రెండు బంతుల్లోనే రెండు సిక్స్లు కొట్టాడు.