కోర్టులకు ఆ హక్కులు ఉంటుందా? -పురంధేశ్వరి
తిరుమల లడ్డూ వ్యవహారం, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. అధికారులతో సమీక్ష చేసి, తనకు వచ్చిన సమాచారంతో సీఎం చంద్రబాబు లడ్డూ వ్యవహారంపై ప్రకటన చేశారన్నారు. ముఖ్యమంత్రిగా జరిగిన అపచారం గురించి ప్రజలకు తెలియజేశారన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయో కోర్టు పరిగణలోకి తీసుకుంటుందన్నారు. సీఎంను మీరు అలా ఎందుకు మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు ఉంటుందా? అనేది అందరూ ఆలోచన చేయాలన్నారు.