ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే పల్లె వెలుగు బస్సుల్లో ప్రమాదకరస్థాయిలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. పరిమితికి మించి ఓవర్ లోడ్ తో బస్సులు తిరిగే పరిస్థితి ఏర్పడింది. జగిత్యాల నుంచి దావన్ పల్లికి వెళ్లే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో 150 మంది ప్రయాణికులు ఎక్కారు. జగిత్యాల నుంచి ఆలూరు, రంగపేట, వీరాపూర్ మీదుగా ధావన్ పల్లికి ఒకే ఒక బస్సు ఉండడంతో పండుగ పూట ప్రయాణీకులతో బస్సు కిక్కిరిసిపోయింది.