జానీ మాస్టర్ కేసులో 5 రోజుల కిందట కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్పై కేసు పెట్టిన బాధితురాలపై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్గా పని చేయడం కోసం.. తన భర్తను ట్రాప్ చేసి.. ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని జానీ మాస్టర్ భార్య ఆరోపించారు.