ఈ-కామర్స్ దిగ్గజాలపై ఆరోపణలు

ఐక్యూ (IQOO), పోకో, వన్ ప్లస్ బ్రాండ్లతో పాటు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు స్థానిక వ్యాపారాలకు హాని కలిగించే, ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించే అన్యాయమైన పద్ధతులకు పాల్పడుతున్నాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AMRA) ఆరోపించింది. ఏఎంఆర్ఏ భారత్ లో 1.5 మిలియన్లకు పైగా మొబైల్ రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఐక్యూ, పోకో (poco), వన్ ప్లస్ (ONEPLUS) కంపెనీలు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లతో ప్రత్యేక ఒప్పందాల ద్వారా.. ఆయా ప్లాట్ ఫామ్ లపై తమ ప్రొడక్ట్ లకు ప్రాధాన్యత లభించేలా చూసుకుంటున్నాయని, రిటైల్ స్టోర్స్ లో తమ ఉత్పత్తుల లభ్యతను పరిమితం చేశాయని రిటైలర్లు ఆరోపిస్తున్నారు. ఈ విధానం మొబైల్ ఫోన్లకు గ్రే మార్కెట్ ను పెంపొందిస్తుందని, స్థానిక రిటైలర్లను బలహీనపరుస్తుందని, ప్రభుత్వానికి లభించే పన్ను ఆదాయం తగ్గుతుందని వివరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here