ఈమేరకు దేవీ నవరాత్రుల్లో రెండో రోజున భక్తితో అమ్మను ధ్యానించుకుని, ఆ సర్వ మంగళ స్వరూపాన్ని మనస్సులో ప్రతిష్టించుకుందామని చిలకమర్తి తెలియజేశారు. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ దేవి తేజోవంతమైన అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, శోభనమూర్తిగా కొలువై ఉంటుంది. ఆదిశంకరులు ఆరాధించిన ఈ గాయత్రీ దేవిని వీక్షిస్తే మనసు పులకితమౌతుంది. దైవ శక్తులకే మూలాధారం శ్రీ గాయత్రీ మాత.