5 కిలోల బరువున్న ఐఈడీలు

జిల్లా బలగాలు, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 53వ బెటాలియన్ సంయుక్త బృందం పెట్రోలింగ్ విధుల్లో ఉండగా కస్తూర్మెటా-మొహండి గ్రామాల రహదారిలోని హోక్పాడ్ గ్రామ సమీపంలో 5 కిలోల బరువున్న ఐఈడీలను గుర్తించారు. సెప్టెంబర్ 30న సీఆర్పీఎఫ్ (CRPF) అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) అమిత్ కుమార్ మాట్లాడుతూ నక్సలిజం ఎక్కువగా ఛత్తీస్ గఢ్ లోని రెండు, మూడు జిల్లాలకే పరిమితమైందని, రాబోయే ఏడాదిన్నరలో వామపక్ష తీవ్రవాదం చరిత్రగా మారుతుందని అన్నారు. నక్సలైట్ ఉద్యమం చివరి దశకు చేరుకుందని అమిత్ కుమార్ తెలిపారు. గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్న మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడు నక్సల్స్ రహితంగా మారాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here