శుక్రవారం కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి ఏటా 15 వేలు ఇవ్వాలని, సన్నం, దొడ్డు రకం అనే తేడా లేకుండా వరి ధాన్యం క్వింటాల్ కు 500 బోనస్ ప్రకటించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. కొందరు రైతులు రోడ్ఢూపైనే పడుకోగా, మరికొందరు మొకాళ్ళపై నిల్చొని నిరసన తెలిపారు. రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించారు.