దక్షిణాది అల్పాహారాల్లో దోశలే మొదటి ప్రాధాన్యత. ఏ ఇంట్లో అయినా వారంలో రెండు మూడు సార్లు దోశలే ఉంటాయి. దోశ పిండిని రెడీ చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. రాత్రంతా పప్పులను, బియ్యాన్ని నానబెట్టి ఉదయాన రుబ్బుకొని ఆ తర్వాత దాన్ని పులిసేలా చేసి దోశెలు వేసుకోవాలి. ఒక్కోసారి మీకు అంత సమయం దొరకదు. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా దోశ మిక్స్ పౌడర్ను రెడీ చేసుకోండి. దీన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు కలిపి చక్కగా దోశలను వేసుకోవచ్చు. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇన్స్టెంట్ దోశ మిక్స్ పౌడర్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.