నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులు సురేశ్ (55), హేమలత(50).. వారి కుమారుడు హరీశ్ (22) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడరు. సురేశ్- హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్ లైన్ బెట్టింగ్లో మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నాడు.