ఎర్రం రవీందర్, చిదురాల శ్రీనివాస్ కు సంబంధించిన గోదాంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రభుత్వ నిషేధిత పొగాకు ప్రొడక్ట్స్ను గుర్తించారు. కొంతకాలంగా వీళ్లు గుట్కా దందా చేస్తున్నట్లుగా గుర్తించి, అక్కడ అక్రమంగా నిల్వ చేసి ఉంచిన దాదాపు లక్షా 58 వేల 450 రూపాయల విలువైన వివిధ రకాల గుట్కా, పొగాకు ప్రొడక్ట్స్ను సీజ్ చేశారు. వాటిని కూడా పరకాల పోలీసులకు అప్పగించారు.