8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వీరే
బిగ్బాస్ గత సీజన్లలో ఆడిన ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఇప్పుడు 8వ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా అడుగుపెడుతున్నారు. హరితేజ తర్వాత టేస్టీ తేజ, నయని పావని హౌస్లోకి వెళ్లారు. దిల్సే మహబూబ్, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, రోహిణి, జబర్దస్త్ అవినాశ్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఎనిమిది మంది నేటి (అక్టోబర్ 6) ఎపిసోడ్లోనే హౌస్లోకి వెళ్లనున్నారు. ఇప్పటికే హౌస్లో నిఖిల్, యష్మి, పృథ్వి, మణికంఠ, సీత, ప్రేరణ, విష్ణుప్రియ, నబీల్ ఆఫ్రిది ఉన్నారు. దీంతో ఈ ఎనిమిది మంది, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు రెండు క్లాన్లుగా హౌస్లో తలపడనున్నారు.