మాల్దీవుల అధ్యక్షుడు మెుహమ్మద్ ముయిజ్జుతో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో భేటీ అయ్యారు. గత ఏడాది వివాదం తర్వాత పుంజుకుంటున్న ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సాయంత్రం దిల్లీకి చేరుకున్నారు మెుహమ్మద్ ముయిజ్జు. ఒకప్పుడు మాల్దీవుల్లో ‘ఇండియా ఔట్’ క్యాంపెయిన్ నిర్వహించిన ముయిజ్జు ఇండియాకు చేరుకోగానే యూటర్న్ తీసుకున్నారు. వాణిజ్య, అభివృద్ధి భాగస్వాముల్లో భారత్ ఒకటని తెలిపారు. ఇరుగుపొరుగువారు స్నేహితుల పట్ల గౌరవం మన డీఎన్ఏలోనే ఉందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here