CM Revanth Reddy : తెలంగాణకు వదరసాయం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలన్నారు. మెట్రో రైలు రెండో దశకు మద్దతు ఇవ్వాలని మరో మంత్రిని కోరారు.