జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మునిసిపల్ కమిషనర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజావాణికి ఆలస్యంగా వచ్చిన జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను అదనపు కలెక్టర్ రాంబాబు ప్రశ్నించారు. ఇంత లేటు ఎందుకని అడిగితే తాను గ్రూప్ వన్ ఆఫీసర్ అనే సమ్మయ్య నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య అధికారుల సాక్షిగా వాదన జరిగింది. చివరికి అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను మందలించారు. ముందస్తు సమాచారం ఇవ్వాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here