వీణాధరే! విపుల మంగళ దానశీలే! భక్తార్తినాశిని! విరించి హరీశ వంద్యే!
కీర్తిప్రదే! అఖిల మనోరదే! మహరే! విద్యాప్రదాయిని సరస్వతి! నౌమి నిత్యం!
అని మనసారా స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి, వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తుందని చిలకమర్తి తెలిపారు. వాక్ శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తుందని అన్నారు. సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో మూడవ రూపం. ప్రాణకోటి జిహ్వాగ్రంపై నివసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసులను అనుగ్రహించి, వారి వాక్ వైభవాన్ని విశ్వవిఖ్యాతి చెందేలా చేసింది ఈ వీణా పుస్తకధారిణి. మనమందరం కూడా శ్రీ సరస్వతీదేవిని శక్తి కొలది అర్చించి, షోడశోపచారాలతో అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ గావించి, వడపప్పు, చలిమిడి, పానకం, అటుకులు, బెల్లం, అన్నం పరమాన్నం, దద్ధ్యోదనం నివేదన చేసి, మన విద్యాబుద్దులను పెంపొందిచుకుందామని చిలకమర్తి తెలిపారు. ఈరోజు ధరించాల్సిన రంగు తెలుపు అని అధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.