కొత్త బంగారు లోకం హీరోయిన్
జిందగీనమా వెబ్ సిరీస్కు ఆదిత్య సర్పోట్దార్, సుకృతి త్యాగి, డానీ మామిక్, రాకీ శాండిల్య, సహాన్, మితక్షర్ కుమార్ దర్శకత్వం వహించారు. ఒక్కొక్కరు ఒక్కో కథను డైరెక్ట్ చేశారు. శ్వేత బసు ప్రసాద్, పంకజ్ కొలి, శ్రేయస్ తల్పడే, అంజలి పాటిల్, సుమీత్ వ్యాస్, ఇవాంకా దాస్, మహమ్మద్ సమాద్, శివానీ రఘువంశీ ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించారు. 14 ఏళ్ల క్రితం కొత్త బంగారులోకం (2008) చిత్రంలో నటించిన శ్వేత బసు ప్రసాద్ బాగా పాపులర్ అయ్యారు. వివాదాల్లో చిక్కుకోవటంతో ఎక్కువగా సినిమా అవకాశాలు రాలేదు. అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. వెబ్ సిరీస్లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ జిందగీనమా సిరీస్లో ఓ లీడ్ రోల్ చేశారు. ఇప్పుడు ఆమె లుక్ కూడా చాలా మారిపోయింది.