పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. 5 నెలలుగా ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చటంతో విషయం బయటికి వచ్చింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. దెందులూరు ఎమ్మెల్యే ద్వారా ఐజీని కలిసి ఫిర్యాదు చేశారు.