ఫుట్ బ్రిడ్జిలు తొలగించడం, యార్డుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోందని కార్మికులు మొరపెట్టుకున్నా రైల్వే అధికారులు స్పందించడం లేదు. విజయవాడ హెచ్ క్యాబిన్, నైజాం గేట్ ప్రాంతాల్లో నిత్యం గంజాయి మూకలు తిష్ట వేసి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేయాల్సిన రైల్వే శాఖ తమకు సంబంధం లేదని వదిలేసింది. దీంతో రైల్వే ఉద్యోగులు దాడులకు గురవుతున్నారు. లోకో పైలట్లు, మెకానికల్, గూడ్స్ షెడ్లలో పనిచేసే కార్మికులు భయంభయంగా పనిచేయాల్సి వస్తున్నా రైల్వే ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
Home Andhra Pradesh విజయవాడ రైల్వే స్టేషన్లో లోకో పైలట్ హత్య.. రైల్వే అధికారులు, పోలీసుల నిర్లక్ష్యమే కారణం-loco pilot...