కర్నూలు జిల్లా దేవరగట్టులో శనివారం కర్రల సమరం జరగనుంది. బన్ని ఉత్సవానికి 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పోలీసులు నాలుగు చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. 100 సీసీ కెమెరాలు, ఐదు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. అక్రమ మద్యం, నాటుసారా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 148 మందిని బైండోవర్ చేసినట్టు ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here