అసలేం జరిగింది?
చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో దసరా పండుగ పూట దారుణ జరిగింది. గుర్తుతెలియని దుండగులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం యజమాని వాచ్మన్ పనిచేస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులు ఇతర పనులు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు బైక్లపై వచ్చిన దుండగులు, కొడవలితో బెదిరించి అత్తాకోడలిపై ఘాతుకానికి పాల్పడ్డారు. తండ్రీకొడుకులను బెదించి ఇద్దరు మహిళలపై దారుణానికి పాల్పడ్డారు.