ఈవో శ్యామలరావు అధికారులతో మాట్లాడుతూ… 48 గంటల్లో తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. 2021లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడిన ఘటనతో టీటీడీ 700 పేజీల విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించిందని గుర్తుచేశారు. ఈ విపత్తు ప్రణాళిక బాగుందనీ, మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని అధికారులను కోరారు. ఈవో స్థాయిలో విపత్తుల నివారణ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడిషనల్ ఈవో ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ సమన్వయ కమిటీ ఉందన్నారు. అగ్నిమాపక శాఖ, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ విభాగం, ఇతర కీలకమైన శాఖల విభాగాధిపతులు, తమ సిబ్బందితో డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు.
Home Andhra Pradesh అతి భారీ వర్షాల హెచ్చరికలతో టీటీడీ హైఅలర్ట్, అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు-tirupati...