బిహార్లోని సివాన్, సరన్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మంది మృతి చెందగా, డజను మందికి పైగా ఆస్పత్రుల్లో చేరారు. సివాన్ లో ఆరుగురు, సరన్ జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.