హైకోర్టులో దక్కని ఊరట
తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పలువురు ఐఏఎస్లకు చుక్కెదురైంది. క్యాట్ (Central Administrative Tribunal) ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్, వాకాటి కరుణ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం… ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.