ఒక్కడికే రూ.23 కోట్లు
రూల్ మారడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ని రూ.18 కోట్లతో కాకుండా రూ.23 కోట్లతో రిటెన్ చేసుకోవాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత పాట్ కమిన్స్కి రూ.18 కోట్లు, అభిషేక్ శర్మకి రూ.14 కోట్లు ఇచ్చి రిటెన్ చేసుకోవాలని హైదరాబాద్ ఫ్రాంఛైజీ నిర్ణయించిందట. ఈ ముగ్గురితో పాటు ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డిలను కూడా కొనసాగించాలని ఫ్రాంఛైజీ ప్రాథమికంగా ఓ నిర్ణయాని వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా ఈ ఐదుగురు ప్లేయర్లకీ రూ.75 కోట్లలోనే సర్దుబాటు చేయనుంది.