ఉల్లంఘనుల్లో పోలీసులే అధికం

ఈ స్పెషల్ డ్రైవ్ లో అక్రమంగా రైళ్లలో ప్రయాణిస్తున్న పోలీసులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఎందుకంటే వారు టికెట్ లేకుండా ప్రయాణించేవారిలో పోలీసులే అత్యధికంగా ఉన్నారని రైల్వే విభాగం తెలిపింది. ‘‘ఇటీవల ఘజియాబాద్- కాన్పూర్ మధ్య జరిగిన ఆకస్మిక తనిఖీల్లో వందలాది మంది పోలీసులు (police) వివిధ ఎక్స్ ప్రెస్, మెయిల్ రైళ్ల ఏసీ బోగీల్లో ఎలాంటి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించాం. మేము వారికి జరిమానా విధించినప్పుడు, మొదట వారు చెల్లించడానికి నిరాకరించారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు’’ అని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. తాము బలవంతంగా వారి నుంచి జరిమానా వసూలు చేశామని, ఈ విషయంలో ప్రయాణికుల స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉందని, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం పట్ల వారు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here