ఆదిమ మానవుడి తొలి ఆనవాళ్లు పాండవుల గుట్ట ప్రాంతంలో లభించడంతో మధ్యప్రదేశ్ లోని భీమ్బేట్కా కన్నా ముందే మానవ సంచారం ఆదిమ కళల ఆవిష్కరణ మొదలైందని హరికృష్ణ తెలిపారు. అలా చిందు యక్షగానం, ఒగ్గుకథ, శారద కథ, కోలాటం, బోనాలు, బతుకమ్మ, గుస్సాడీ, కొమ్ము కోయ, లంబాడి, ధింసా ఇలాంటి ఎన్నో జానపద, గిరిజన, ఆదివాసి కళారూపాలు ఈ నేలమీద పురుడు పోసుకున్నాయని వివరించారు. సామాన్య ప్రజల జీవన విధానంలో ఇవన్నీ కూడా అంతర్భాగం అయ్యాయని అన్నారు.