గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు తడిసి ముద్దవుతోంది. ఇక ఇప్పుడు రాజధాని చెన్నైలో నివాసముంటున్న ప్రజలను భారీ వర్షాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. చెన్నైతో పాటు తమిళనాడులోని తిరువళ్లూరు, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం, కల్లకురిచ్చి, తిరువణ్ణామలై, రాణిపేటై, వేలూరు, తిరుప్పత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, కడలూరు, నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, మదురై, కన్యాకుమారి జిల్లాల్లో ఐఎండీ శనివారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here