కరీంనగర్ జిల్లా కేంద్రం ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల, రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. మెడికల్ హబ్ గా కరీంనగర్ మారిందని బండి సంజయ్ కేంద్ర మంత్రికి వివరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్ కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. గ్రానైట్ పరిశ్రమ, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులతో వలస కార్మికులు ఎక్కువమంది పనిచేస్తున్నారని తెలిపారు. వారందరు ప్రభుత్వ పరంగా వైద్యం పొందడానికి ఈఎస్ఐ ఆసుపత్రి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here