క్షమించమని సూసైడ్ నోట్

ఆ బాలిక గదిలో పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆ బాలిక ‘నన్ను క్షమించండి, నేను చేయలేను. నేను జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేను’’ అని రాశారు. నిన్న ఉదయం 11 గంటల సమయంలో పీఎస్ జామియా నగర్ లోని ఓఖ్లా ప్రధాన మార్కెట్ లోని ఓ భవనం 7వ అంతస్తు పైనుంచి దూకి ఆ 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికిి వెళ్లి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ‘‘ఆ 17 సంవత్సరాల బాలిక 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత జేఈఈ (JEE)కి ప్రిపేర్ అవుతోంది. చదువు ఒత్తిడి, అంచనాలను అందుకోలేదనే కారణంతో ఆమె సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది’’ అని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here