సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అతన్ని చంచల్గూడ జైలుకి తరలించారు. దీనిపై హీరో నాని స్పందిస్తూ ‘ప్రభుత్వాలైనా, అధికారులైనా, మీడియా పర్సన్స్ అయినా సినిమా వాళ్ళపై ఎక్కువ ఉత్సాహం చూపిస్తుంటారు. సామాన్య ప్రజానీకంపై కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలి. థియేటర్లో జరిగిన ఘటన గుండెల్ని పిండేసేదే. దాని వల్ల మనం గుణపాఠం నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఉన్నతమైన సమాజంలో జీవిస్తున్నాం. ఆ ఘటన జరగడానికి మనందరం బాధ్యులమే. దానికి ఒక్కడినే బాధుడ్ని చేయడం సరికాదు’ అంటూ ట్విట్టర్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు.