బడ్జెట్ లో ఎరుపు రంగు ఎందుకు?
బడ్జెట్ బ్రీఫ్ కేసు లేదా బండిల్ కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. కొన్నిసార్లు ఎరుపు రంగు దుస్తులతోనే బడ్జెట్ ను సమర్పించే మంత్రులు కూడా ఉన్నారు. ఇలా ఎరుపు రంగులో బండిల్ వాడడం వల్ల ప్రభుత్వం తమ ప్రజలకు శక్తివంతమైన, స్థిరత్వమైన బలం కలిగి ఉన్న పాలనను అందిస్తున్నట్టు సందేశాన్ని ఇవ్వడమే. ఎరుపు.. శక్తిని, అధికారాన్ని సూచిస్తుంది. ఇది సూర్యుడు, అగ్ని, జీవితంతో ముడిపడి ఉంటుంది. అలాగే సంపదకు, శ్రేయస్సుకు, అదృష్టానికి కూడా చిహ్నంగా అనేక సంస్కృతులలో చెబుతారు. హిందూ మతంలో కూడా ఎరుపును శుభ కరమైన రంగుగా చెబుతారు. అందుకే బడ్జెట్ సమర్పించడానికి తెచ్చే బ్రీఫ్ కేసును కూడా ఎరుపు రంగులోనే పెట్టారని ఎంతోమందికి నమ్మకం.