బాల బాలికలకు పని నుంచి విముక్తి కలిగించి.. తిరిగి బడికి పంపించే కార్యక్రమం ఆపరేషన్ స్మైల్ అని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ వివరించారు. ఆపరేషన్ స్మైల్-XI పూర్తయిందని చెప్పారు. జనవరి 1 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మొత్తం 83 మంది బడీడు పిల్లలకు విముక్తి కలిగించామన్నారు. వీరిలో తెలంగాణ, ఏపీ, యూపీ, ఒరిస్సా, ఛత్తీస్‌గడ్, బీహార్, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నారని చెప్పారు. వారిని వారి తల్లిదండ్రులకు, బంధువులకు అప్పగించామని సీపీ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here