టీడీపీ వెర్షన్..
‘2025-26 ఆర్థిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లభించింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ స్టీల్కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు సహా అనేక కేటాయింపులు చేశారు. ఇప్పటికే గత బడ్జెట్లో రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధికి కేంద్రం బడ్జెట్లో నిధులు ఇచ్చింది. ఇవే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కి, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బీపీసీఎల్ రిఫైనరీ, రైల్వే జోన్ సహా అనేక ప్రాజెక్టులకు చేయూతనిచ్చింది’ అని టీడీపీ పేర్కొంది.