అలాగైతే దీప చస్తుంది

శౌర్య చనిపోతే ఎలాగే అని పారిజాతం ప్రశ్నిస్తుంది. “చావనీ. ఆ తర్వాత బెంగపెట్టుకొని దీప చస్తుంది. ఆ తర్వాత దీప నా వాడు అవుతాడు” అని కర్కషంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. కార్తీక్ అంటే అంత పిచ్చి ఏంటే అని పారు అడుగుతుంది. తాను బతుకుతున్నది రెండింటి కోసమే అని.. అవి ఆస్తి, బావ అని జ్యోత్స్న చెబుతుంది. చూస్తుంటే నీకు రెండు దక్కేలా లేవని, తప్పుల మీద తప్పులు చేస్తున్నావని ఆగ్రహిస్తుంది పారిజాతం. కార్తీత్, దీప ఈ విషయం మీ అమ్మకి చెబితే అంతే అంటుంది. అయితే, ఇప్పుడు వాళ్లు చెప్పరని జ్యోత్స్న నమ్మకంగా అంటుంది. వాళ్లకు రూ.50లక్షల డబ్బు ఇప్పటికిప్పుడు ఎవరూ ఇవ్వరని, నేనే దిక్కు అనేలా చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here