చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసర క్షేత్రం లక్షలాది భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాసరలో అక్షరాభ్యాసం చేస్తే చదువుల తల్లి కరుణిస్తుందనే నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.