పంట పెట్టుబడి సాయానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు ముందుగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.