నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి అప్పగించారు. అటు బిజేపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా చిన్నమైల్ అంజిరెడ్డి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బిజేపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. బిఆర్ఎస్ టికెట్ ఆశించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. గడిచిన ఐదు రోజుల్లో పట్టభద్రుల స్థానానికి 49 మంది నామినేషన్ వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here