స్పైసీ ఫుడ్ అనేది చాలా మందికి ఇష్టం. పచ్చళలు, బిర్యానీలు, కూరలు వంటివి కారంగానే ఉండాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు అనుకోకుండా ఎక్కువ స్పైసీగా తింటారు. లేదా పచ్చిమిరపకాయను నమిలేస్తూ ఉంటారు. ఆ సమయంలో నోరు మంటగా మారడమే కాకుండా ఈ మసాలా కడుపులో చికాకు కలిగిస్తుంది. విపరీతమైన దగ్గు, మంట కూడా వస్తుంది. ఆ కారాన్ని తట్టుకోలేక కొంతమంది విపరీతంగా నీరు తాగేస్తారు. అయినా కూడా మంట తగ్గదు. అలాంటప్పుడు చిన్న చిన్న చిట్కాల ద్వారా మంటను తగ్గించుకోవచ్చు.